హైదరాబాద్లోకి అమెజాన్ క్యాంపస్ ప్రారంభం

హైదరాబాద్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ క్యాంపస్ ఇవాళ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడారు. గత 15 ఏళ్లలో ఇండియాలో అమెజాన్ రూపుదిదుకున్న తీరును ఆయన వివరించారు. కొన్నేళ్ల క్రితం కేవలం అయిదుగురు సభ్యలుతో అమెజాన్ ఏర్పాటు కోసం ఇక్కడకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో సుమారు 62 వేల మంది అమెజాన్లో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్యాంపస్ ను రాష్ట్ర హోంమంత్రి వెహబూద్ అలీ ప్రారంభించారు. మంత్రి అలీకి క్యాంపస్ గురించి అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ వివరించారు. గచ్చిబౌలిలోని నానకిరామ్ గూడలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్.. అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్ కావడం విశేషం. తెలంగాణకు ఇది గర్వకారణమని, తెలంగాణలోనే ఇదే అతిపెద్ద బిల్డింగ్ అని హోంమంత్రి అలీ అన్నారు. తెలంగాణ తెలంగాణ తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఈ సందర్బంగా మాట్లాడారుఅమెజాన్ ఇండియా న్యూ క్యాంపస్ ఆయన మెచ్చుకున్నారు. నగరానికి ఇది మరో మణిహారంగా మారనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర, నగర రూపురేఖల్ని మార్చడంలో అమెజాన్ సంస్థ కీలకంగా మారుతుందని జయేశ్ రంజన్ అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, ఎంఎల్ టెక్లోనూ అమెజాన్ తన సేవల్ని అందించనుందన్నారుఅవెురికా తర్వాత విదేశాల్లో ఉన్న క్యాంపస్లలో.. ఇది అమెజాన్ స్వంత బిల్డింగ్ కావడం విశేషం. గ్లోబల్ రియల్ కూడా మాట్లాడారు. సుమారు 15వేల మంది అమెజాన్ క్యాంపస్ లో పనిచేయనున్నారు. సోషల్ మీడియాలో క్యాంపస్ ప్రారంభం పై ట్వీట వెల్లువెత్తుతున్నాయి.